25 March, 2026 | 12:23 AM

ఎమ్మెల్యేను కాంగ్రెస్‌లో చేర్చుకోవద్దు

05-07-2024 12:13 AM

సెల్‌టవర్ ఎక్కిన ఓ కార్యకర్త

గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు రావడంతో గురువారం జడ్పీ చైర్‌పర్సన్ సరిత అభిమానులు, కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా గద్వాల లో నిరసన చేపట్టాలరు. ఈ సందర్భం గా వారు మాట్లాడుతూ.. ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మెల్యేను కాంగ్రెస్ పార్టీ లో చేర్చుకోవద్దని డిమాండ్ చేశారు. బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిని కాంగ్రెస్‌లో చేర్చుకుంటే సెల్ టవర్ పైనుంచి దూకేస్తానం టూ ప్రసాద్ టవర్ ఎక్కి బెదిరింపులకు దిగాడు. పోలీసులు సెల్ టవర్ దగ్గరకు వెళ్లి ప్రసాద్‌కు నచ్చజెప్పి కిందకు దింపారు.