calender_icon.png 13 June, 2025 | 1:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీటీ-3 పత్తి విత్తనాలు వేయద్దు..

11-06-2025 05:05:36 PM

వాటిని అమ్మినా, కొనినా నేరమే..

వ్యవసాయ అధికారి బి.రాజు..

మునగాల: సూర్యాపేట జిల్లా(Suryapet District) మునగాల మండలంలోని  నరసింహుల గూడెం, జగన్నాధపురం, మునగాల గ్రామాలలోని పత్తి విత్తనాలు అమ్ముతున్న డీలర్ దుకాణ షాపులను  వ్యవసాయ అధికారి బి రాజు(Agriculture Officer Rajuతనిఖీ చేసారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ... కొంతమంది రైతులు ఇతర రాష్ట్రాల నుంచి ప్రభుత్వంచే నిషేధించబడిన బీటీ-3 పత్తి విత్తనాలను కొనుగోలు చేసి పొలంలో నాటుతున్నారని, ఆ విధంగా బీటీ-3 పత్తి విత్తనాలను కొనడం, గ్రామంలో ఉన్న వారికి ఇవ్వడం, విత్తనాలు నాటడం అన్నీ కూడా చట్టరీత్యా నేరం, బీటీ-3 పత్తి విత్తనాలు నాటిన వారికి, ఆ పొలంలో పనిచేసిన వారందరికీ కూడా క్యాన్సర్, చర్మ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది.

ఇప్పటికే ఎవరు అయినా వేసిన వారి పొలం లో కలుపు తీయడానికి కాని మందు వెయ్యటానికి కాని, ప్రత్తి తీయ్యడానికి కాని ఎవరు వెళ్ళవద్దు, వెళ్లి మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు, ఈ బిటి 3 విత్తనాల వల్ల రైతులు, కూలీలు, గ్రామస్తులు అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంది.

మీ గ్రామంలోని ఎవరైనా వ్యక్తులు కానీ, లేదా బయటనుంచి వచ్చిన వ్యక్తులు కానీ బిటి 3 విత్తనాలను అమ్ముతున్నట్లుగా లేదా కొంటున్నట్లుగా తెలిస్తే మునగాల వ్యవసాయ శాఖ సిబ్బందికి గాని లేదా మునగాల పోలీస్  శాఖ వారికి కానీ సమాచారం ఇచ్చి మీ గ్రామాన్ని కాపాడుకోవలసిందిగా కోరుతున్నాము. రైతులు కూడా లైసెన్స్ కలిగిన డీలర్ నుంచే బీటీ 2 విత్తనాలను మాత్రమే బిల్ తీసుకొని, కొనుగోలు చేయాలి.బీటీ 3 ప్రత్తి విత్తనాలు ప్రభుత్వం నిషేధించింది అంటే రైతులు అర్ధం చేసుకోవాలి వాటి వలన మానవాళికి ఎంత ప్రమాదమో అర్థం చేసుకొని ఇలాంటి బిటి 3 విత్తనాలను కొనకూడదు,  వేయకూడదు అని అన్నారు.ఈ కార్యక్రమంలో డీలర్లు, రామ్ రెడ్డి, శ్రీశైలం, సైదులు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.