15 April, 2026 | 1:18 PM

Breaking News

టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడుగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు   •   మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •  

ప్రజలను వంచించిన కాంగ్రెస్ ను నమ్మకండి

04-02-2026 04:11 PM

బీఆర్ఎస్ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి భూక్య జాన్సన్ నాయక్

ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీలో బిఆర్ఎస్ పార్టీ ప్రచారం మొదలుపెట్టింది. ఈసారి మున్సిపాలిటీ ఎన్నికలను ఆ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఖానాపూర్ మున్సిపాలిటీ పై బీఆర్ఎస్ జెండా ఎగరవేయాలని తపనతో ఉన్నది. ఈ మేరకు బుధవారం పట్టణంలోని శ్రీరామ్ నగర్ కాలనీలో టిఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి భూక్య ఝాన్సన్ నాయక్ తమ పార్టీ అభ్యర్థుల తరఫున ముమ్మరంగా ప్రచారం చేశారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చి ప్రజలను ఏ విధంగా మోసం చేసింది అనేది ప్రజలకు వివరించారు. రైతులను ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాలని ఆ పార్టీ నాయకులు ఓటు అడిగేందుకు వస్తే ఎక్కడికక్కడ నిలదీయాలని, ప్రభుత్వం ప్రజలకు బాకీ ఉన్న నగదును నిలదీసి రాబట్టుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. తమ పార్టీ అభ్యర్థి తోట సుమిత్ ను ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. మాజీ మార్కెట్ చైర్మన్ సకారం శ్రీనివాస్, మాజీ ఎంపీపీ రవీందర్, మాజీ ఎంపీపీ వైస్ చైర్మన్ వాల్ సింగ్, అజయ్, తదితరులు ఉన్నారు.