17-06-2025 12:29:24 AM
కొత్తపల్లి మాజీ సర్పంచ్ జితేందర్ రెడ్డి..
తిమ్మాపూర్, జూన్ 16 విజయ క్రాంతి:ఎమ్మెల్యే ఆన్ వీల్స్ పేరుతో పనిచేస్తున్న ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణకు కృతజ్ఞతలనీ, అయితే అందులో ప్రజలకు పనికొచ్చేవి చేస్తే మరింత మంచిదంటూ కొత్తపల్లి మాజీ సర్పంచ్ జితేందర్ రెడ్డి సూచించారు. సోమవారం ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి మాట్లాడారు. ఎమ్మెల్యే ఆన్ వీల్స్ లో చేస్తున్న పనుల్లో పూర్తి స మాచారం తెలుసుకొని పనిచేస్తే బాగుండేది అని నా అభిప్రాయపడ్డారు.
గ్రామ అభివృద్ధి కోసం వంకరగా ఉన్న 18ఫీట్ల నక్ష తోవను, సరిగ్గా చేసి 30ఫీట్లుగా మార్చామని తెలిపారు. నక్షతోవకు కల్వర్టు అడ్డంగా ఉండేదనీ, దాన్ని కొంచెం పక్కకు జరిపి నేరుగా హైవేకి అనుసంధానం చేశామని చెప్పారు. ఇవేవీ తెలియని ఎమ్మెల్యే పీఏ మురళీధర్ రెడ్డి, గ్రామానికి చెందిన మరోవ్యక్తి రోడ్డుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అప్పటి సర్వేయర్ సమక్షంలోనే రోడ్డును అభివృద్ధి చేశామనీ, అందులో ఎలాంటి అక్రమాలకు తావులేదని స్పష్టం చేశారు.
ప్రజల సొమ్మును హరించే పీఏను పెట్టండి..
ప్రజలు కష్టపడి పనిచేసి నాలుగు రాళ్ళు వెనకేసుకుంటే వాటిని కూడా హరిస్తున్న ఎమ్మెల్యే పీఏను ఆయన ఎందుకు దగ్గర పెట్టుకుంటున్నాడో అర్ధం కావడం లేదని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మీకు మీ పీఏ అరాచకాల కారణంగానే మంత్రి పదవి రాలేదనీ, ఇప్పటికైనా అతన్ని దూ రం పెడితే మీకే మంచిదని హితవు పలికారు.
గ్రామస్తుల ఆశీర్వాదంతో మూడుసార్లు సర్పంచి గా పనిచేసిన తాను ప్రజల శ్రేయస్సుకు పాటుపడడమే తప్ప ఎవరికీ అన్యాయం చేసిందే లేదన్నారు. ఎమ్మెల్యే ఆన్ వీల్స్ పేరుతో ఓ తప్పుడు ఫిర్యాదు సృష్టించి, గ్రామాభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేయవద్దని ఎమ్మెల్యే కవ్వంపల్లిని కోరారు.