calender_icon.png 18 July, 2025 | 8:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోగుల కష్టాల్ని, బాధలను తీర్చేది వైద్యులే..

18-07-2025 01:06:52 AM

రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి

బాన్సువాడ, జూలై 17 (విజయ క్రాంతి), రోగుల కష్టాలను, బాధలను తీర్చేది వైద్యులేనని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ ప్రభుత్వాసుపత్రిలో అడ్వైజరి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. బాన్సువాడ లో ప్రభుత్వ నిర్మించిన తర్వాత ప్రత్యేక శ్రమతో వైద్యులు కృషి వల్ల ఆసుపత్రికి మంచి పేరు వచ్చిందన్నారు.

కాలక్రమేణ అవసరాల నిమిత్తం వంద పడకల మాత శిశు సంక్షేమ ఆస్పత్రి నీ నిర్మించుకున్నాము. తెలంగాణ రాష్ట్రంలోనే బాన్సువాడ మాతా శిశు సంక్షేమ ఆసుపత్రికి మంచి పేరు వచ్చిందన్నారు. ఎన్నో అవార్డులు కూడా వచ్చాయన్నారు. ఆస్పత్రి వైద్యులు సిబ్బంది చేసిన కృషివల్లే అవార్డులు వచ్చాయి. ఆస్పత్రిలోని కేవలం విషయంలో డెలివరీ, ఆపరేషన్, ట్రీట్మెంట్ విషయంలో కానీ వేరే ఇతర ప్రభుత్వ ఆసుపత్రులతో పోలిస్తే బాన్సువాడ మాతాజీ సంక్షేమ ఆసుపత్రి ఏరియా ఆసుపత్రి వైద్యులు అద్భుతమైన సేవలందిస్తున్నారు.

తాము మౌలిక సదుపాయాలు కల్పిస్తాము కానీ రోగుల కష్టాలని, బాధలను తీర్చేది వైద్యులేనని అన్నారు. ఆస్పత్రి సూపర్డెంట్ విజయలక్ష్మి సుధీర్ఘ అనుభవంగాల వైద్యురాల లని అన్నారు. గతంలో పనిచేసిన ఆసుపత్రి సూపర్డెంట్ శ్రీనివాస్ ప్రసాద్ ఆధ్వర్యంలో ఆస్పత్రికి ఎన్నో ఆవార్డులు వచ్చాయన్నారు. అంబులెన్స్ కొరత ఉందని అడ్వైజర్ కమిటీ సభ్యులు తన దృష్టికి తేవడంతో కమిషనర్ తో మాట్లాడి తే సానుకూలంగా స్పందించారన్నారు.

గత ప్రభుత్వాలయంలో 22 లక్షల రూపాయల నిధులతో అంబులెన్స్ ఇప్పించాను అన్నారు. 230 పడకల ఆసుపత్రి కి అవుట్ పోస్ట్ పెట్టించాలని కమిటీ సభ్యులు అడగగా జిల్లా ఎస్పీతో మాట్లాడి తే  సానుకూలంగా స్పందించారన్నారు. ఆస్పత్రిలో గత ఆరు నెలలలో 348 ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు నిర్వహించారని తెలిపారు. పేద ప్రజల దృష్టిలో నా దృష్టిలో ఆసుపత్రి ఒక దేవాలయం అని వైద్యులు దేవుళ్ళతో సమానమని అన్నారు.

ఆస్పత్రిలో రోగులను పరిశీలించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఆగ్రో కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు, అసిస్టెంట్ కలెక్టర్ కిరణ్మయి, ఆస్పత్రి సూపర్డెంట్ విజయలక్ష్మి, అడ్వైజర్ కమిటీ సభ్యులు, పట్టణ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.