calender_icon.png 15 June, 2025 | 8:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైద్యులు గిరిజనుల పట్ల బాధ్యతగా వ్యవహరించాలి

14-06-2025 12:29:50 AM

భద్రాచలం ఐటీడీఏ పీవో రాహుల్ 

భద్రాచలం, జూన్ 13, (విజయ క్రాంతి)ఏజెన్సీ ఆదివాసి మారుమూల గిరిజన గ్రామాలలోని పి హెచ్ సి లలో పనిచేయుచున్న డాక్టర్లు పి హెచ్ సి కి వచ్చే రోగులకు వైద్య పరీ క్షలతో పాటు సిబ్బందిని కోఆర్డినేషన్ చేసుకొని తమ విధులు బాధ్యతగా నిర్వహించేల చూడవలసిన బాధ్యత సంబంధిత మెడికల్ ఆఫీసర్లపై ఉందని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రా హుల్ అన్నారు.

శుక్రవారం ఐటిడిఏ సమావేశం మందిరంలో ఏజెన్సీ ఏరియాలోని 29 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రా ల పరిధిలోని గ్రామాలలో నివసిస్తున్న గిరిజన కుటుంబాలకు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు వహించేలా సిబ్బందిని అప్రమత్తం చేయాలన్నారు.

ఇంటింటికి తిరిగి గిరిజనులకు అవగాహన కల్పించాలని, గర్భిణీ స్త్రీల పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, అందుకు ఆశా వర్కర్, ఏఎన్‌ఎం కోఆర్డినేషన్తో గర్భిణీలకు ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహించి పీహెచ్సీలలోనే నార్మల్ డెలివరీ అయ్యేవిధంగా చూడాలన్నారు. ప్రైవేట్ ఆస్పత్రులకు మాత్రం ఎవరిని పంపకూడదని, అందుకు డాక్టర్లు ప్రత్యేక బాధ్యత తీసుకోవాలన్నారు.

ప్రతీ విషయం రిజిస్టర్ లలో నమోదు చేసి పీహెచ్ సీ లలో ఉన్న బోర్డుపై నోట్ చేయాలని, ఇప్పుడు వచ్చే మూడు నెలలు పిహెచ్ సి లలో పనిచేసే డాక్టర్లు సిబ్బంది అందరూ 24 గం టలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పీహెచ్ సీ లలో సరిపడా అన్ని రోగాలకు సంబంధించిన మందులు అందుబాటులో ఉంచుకోవాలన్నారు.

మారుమూల ప్రాంతాలలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు వహించాలని, గర్భిణీ స్త్రీలను స్కానింగ్ కొరకు తీసుకువచ్చే ఆశ వర్కర్లు, ఏఎన్‌ఎంలు సంబంధిత మెడికల్ ఆఫీసర్ అనుమతితో ఏరియా ఆసుపత్రికి తీసుకొని వచ్చేముందు ఆర్‌ఎంఓని కానీ, ఆసుపత్రి పర్యవేక్షకుడి అనుమతి తీసుకొని వచ్చి దగ్గర ఉండి స్కానింగ్ చేయించుకొని తీసుకొని వెళ్లాలన్నారు.

వర్షాకాలంలో ఎక్కువ శాతం చర్ల,దుమ్మగూడెం, సింగరేణి, కారేపల్లి మండలాలలో దోమల ప్రభావం వలన సీజనల్ వ్యాధులు ఎక్కువగా ప్రబలే అవకాశం ఉందని, అందుకు సంబంధిత ఏఎన్‌ఎంలు, సూపర్వైజర్లు, ఆశా వర్కర్లు గ్రామపంచాయతీ వారి సహకారం తీసుకొని ఇంటింటికి తిరిగి శానిటేషన్ పరంగా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకొని దోమల మందు పిచికారి చేయాలన్నారు.

గ్రామాలలో డ్రైనేజీలలో నీరు నిలువ లేకుండా శుభ్రం చేయించాలని, గ్రామపంచాయతీ సిబ్బంది సహకరించకపోతే సంబంధిత ఎంపీడీవోలకు,డిప్యూటీ డీఎంహెచ్‌ఓకు తెలియజేయాలన్నారు. పీహెచ్ సీ పరిధిలోని గ్రా మాలలో డెంగ్యూ జ్వరముతో బాధపడుతున్న రోగుల పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, ఏదైనా గ్రామంలో డెంగ్యూ నిర్ధారణ కేసులు నమోదైతే ఆ గ్రామంలో పూర్తిస్థాయిలో శానిటేషన్ చేయాలన్నారు.

రోగులకు ఎప్పటికప్పుడు వైద్య పరీక్ష లు నిర్వహించి వారికి తగినన్ని మందులు అందజేయాలని, అవసరమైతే ఆ గ్రామంలో ప్రత్యేకంగా మెడికల్ క్యాంపులు నిర్వహించి, అందరికీ రక్త పరీక్షలు చేసి డెంగ్యూ వ్యాధి నిర్ధారణ అయితే ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

డెలివరీ కోసం ఏరియా ఆసుపత్రికి వచ్చే మహిళల పట్ల ఏరియా ఆసుపత్రి సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకొని వారికి ప్రత్యేక వసతి సౌకర్యాలు కల్పించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ చైతన్య, ఏరియా ఆసుపత్రి పర్యవేక్షకుడు రామకృష్ణ, డాక్టర్లు జయలక్ష్మి, మధువరన్, పుల్లారెడ్డి, తేజశ్రీ వివిధ పీహెచ్సి ల నుండి వచ్చిన మెడికల్ ఆఫీసర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.