15-06-2025 01:15:36 AM
ముషీరాబాద్, జూన్ 14: గృహ కార్మికుల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం తక్షణమే ప్రత్యేక చట్టం తీసుకురావాలని జాతీయ గృహ కార్మికుల వేదిక(ఎన్పీడీడబ్ల్యూ) కన్వీనర్ లిస్సీజోసెఫ్ డిమాండ్ చేశారు. గృహ కార్మికులను కార్మికులుగా గుర్తించి సామాజిక భద్రత కల్పించాలని కోరారు.
సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను కేంద్రం ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. జూన్ 16న అంతర్జాతీయ గృహ కార్మికుల దినోత్సవం పురస్కరించుకుని శనివారం బషీర్ బాగ్ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గృహ కార్మికుల దినోత్సవ బ్రోచర్ ఆవిష్కరించి ఆమె మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్రంలో 11 లక్షలకు పైగా గృహ కార్మికులు ఉండగా, ఒక హైదరాబాద్ లోనే 5 లక్షల గృహ కార్మికు లు ఉన్నారని తెలిపారు. అర్హులైన కార్మికులందరికీ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని కన్వీనర్ లిస్సీజోసెఫ్ కోరారు.