31 March, 2026 | 4:58 PM

గ్రంథాలయానికి పుస్తకాల విరాళం

31-03-2026 03:03 PM

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లా కేంద్ర గ్రంథాలయంలో పాఠకులకు ఉపయోగపడే విధంగా పుస్తకాల విరాళల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ప్రభుత్వ పరీక్షల సహాయ అధికారి మర్యాల ఉదయ బాబు గ్రంథాలయానికి మొత్తం 70 పుస్తకాలను విరాళంగా అందజేశారు. ఈ పుస్తకాలు ఇంజనీరింగ్, మెడిసిన్, లా కాంపిటీటివ్ పరీక్షలు, పౌరాణిక అంశాలకు సంబంధించినవిగా ఉండి విద్యార్థులు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో లైబ్రేరియన్ లు టి.సదానందం, కె.ప్రవీణ గ్రంథాలయ పాఠకులు, సిబ్బంది పాల్గొన్నారు.