17-05-2025 12:00:00 AM
రాజాపూర్ మే:16 మండలం గుండ్ల పొట్లపల్లి గ్రామంలో బొడ్రాయి వేడుకలు ని ర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి నారాయణ నాయక్ విరా ళం అందించి గొప్ప మనసు చాటుకున్నారు. శుక్రవారం బొడ్రాయి పండుగ వేడుకల కోసం రూ.51వేలు విరాళంగా గ్రామ పెద్దలకు అందజేశారు.
ఈ సందర్భంగా గుండ్ల పొట్లపల్లి గ్రామస్తులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు నారాయణ నాయక్ ను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సునీత శ్రీనివాస్ నాయక్, కాంగ్రె స్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గుండ్ల పొట్లపల్లి గ్రామస్తులు పాల్గొన్నారు.