21-06-2025 05:52:33 PM
ప్రధానోపాధ్యాయులు ఉల్లెందుల సైదులు..
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు దాతల సహకారాన్ని సద్వినియోగం చేసుకొని ఉన్నతలుగా ఎదగాలని ప్రధానోపాధ్యాయులు ఉల్లెందుల సైదులు కోరారు. శనివారం మండల పరిధిలోని కోమటిపల్లి గ్రామ ప్రాథమిక పాఠశాలలో చీదెళ్ల గ్రామ వాస్తవ్యులు పొదిల్ల నాగేశ్వర్ రావు-మాధవీలత దంపతుల కూతురు చిరంజీవి లోహిత జన్మదినం సందర్భంగా పాఠశాలలో చదివే 26 మంది విద్యార్థులకు స్కూల్ బ్యాగులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో హెచ్ఎం మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని, దాతలు ముందుకు వచ్చి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని కోరారు. అనంతరం దాతలను సన్మానించారు.కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు సృజన,అంగన్వాడీ టీచర్ శివరంజని,రిటైర్డ్ లెక్చరర్ దూదిగామ గోపాల్,పద్మ,యశోద తదితరులు పాల్గొన్నారు.