17-02-2026 03:34:14 PM
మోతె,(విజయక్రాంతి): మోస కారి మాటలతో ప్రజలను మోసం చేయవద్దని బీఆర్ఎస్ జిల్లా నాయకులు ఏలూరి వెంకటేశ్వరావు, అరె లింగా రెడ్డిలు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు శీలం సైదులు అధ్యక్షతన జరిగిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 72వ పుట్టినరోజు వేడుకలను కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు.
అనంతరం వారు మాట్లాడుతూ... కేసీఆర్ ప్రజలకు చేసిన అభివృద్ధి పనులతో ప్రతి ఒక్కరి హృదయాలలో నిలిచిన నాయకుడని మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లు గుండాల గంగులు, మూడు కృష్ణ, శ్యామ లేటి కోటేష్, శంకర్ నాయక్, బానోతు గాంధీ, బి ఆర్ యస్ మండల కార్యదర్శి మద్ది మధు సుదన్ రెడ్డి, బానోతు దేవల నాయక్, మిక్కిలినేని సతీష్, పిట్టల నాగేష్, ఇండ్ల వెంకటేశం, కృష్ణ, ముత్తయ్య, సైదులు, బొక్క ఉపేందర్ రెడ్డి, తరుణ్, నవీన్, ప్రభంజన్, తదితరులు పాల్గొన్నారు.