12 May, 2026 | 1:23 AM

వర్షాకాలంలో సమస్యలు రానివ్వొద్దు

12-05-2026 12:00 AM

రాజేంద్రనగర్ జోనల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి 

రాజేంద్రనగర్, మే 11 (విజయక్రాంతి): వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అప్రమత్తం గా ఉండాలని రాజేంద్రనగర్ జోనల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. సోమవా రం రాజేంద్రనగర్ జోన్ పరిధిలోని రాజేంద్రనగర్, అత్తాపూర్, చాంద్రాయణగుట్ట, జం గంమెట్,  ఫలుకునుమ, బహుదూర్ పుర సర్కిళ్లలో ప్రజలు ఇబ్బందులు పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సర్కిల్ కా ర్యాలయంలో జీహెచ్‌ఎంసీ, హైడ్రా, ఇంజనీరింగ్ విభాగాల అధికారులతో సమీక్ష సమా వేశం నిర్వహించారు.

హైడ్రా గుర్తించిన  వర్షాకాలంలో నీరు నిలచి ఉండే 30 ప్రాం తాల్లో ఇప్పటినుంచే జాగ్రత్తలు తీసుకోవాల న్నారు. అత్తాపూర్ సర్కిల్ లలో నీరు నిలిచే ప్రాంతాలు 15 ఉన్నాయని, మిగతా సర్కిళ్లలో 15 పాయింట్లు ఉన్నాయని తెలిపారు. సమావేశంలో హైడ్రా రాజేంద్రనగర్ జోనల్ ఇన్‌చార్జి మహేష్, జీహెచ్‌ఎంసీ రాజేంద్రనగర్ జోన్ ఇన్‌చార్జి ఎస్‌ఈ నరేందర్‌గౌడ్, ఈఈలు వెంకట శేషయ్య పాల్గొన్నారు.