26-06-2025 04:30:43 PM
మంథనిలో 2కే రన్ లో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీను బాబు..
మంథని (విజయక్రాంతి): యువత మత్తు పదార్థాలకు బానిసై బంగారు భవిష్యత్తును పాడు చేసుకొవద్దని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు(TPCC General Secretary Duddilla Srinu Babu) అన్నారు. మంథని పట్టణంలో గురువారం యాంటీ డ్రగ్స్ డే(Anti-Drugs Day)ను పురస్కరించుకొని మంథని సీఐ రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన 2కే రన్ ను జెండా ఊపి పెద్దపల్లి డీసీపీ కరుణాకర్, గోదావరిఖని ఏసిపి రమేష్ ప్రారంభించారు. అనంతరం మంథనిలోని పాత పెట్రోల్ బంక్ నుండి బస్ డిపో మీదుగా గాంధీ చౌక్ వరకు 2కే రన్ నిర్వహించారు. ఈ 2కే రన్ లో పాఠశాల విద్యార్థులు, యువకులు, రాజకీయ పార్టీల నాయకులు అధిక సంఖ్యలో పాల్గోన్నారు.
ఈ సందర్భంగా వారితో కలిసి శ్రీను బాబు మాట్లాడుతూ... యువత మత్తు పదార్థాలకు బానిసై చాలా మంది అనారోగ్యం పాలై కుటుంబాలు ఆర్థికంగా చాలా నష్టపోయరన్నారు. మత్తు పదార్థాలు ఎవరైనా వినియోగించిన, మత్తు పదార్థాలు కలిగిఉన్న సమాచారాన్ని పోలీసులకు తెలిపి సమాజాన్ని కాపాడాలని కోరారు. ఈ సందర్భంగా మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ప్రతి ఒక్కరి చేత పోలీసులు ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు డేగ రమేష్, తాడవేన శ్రీనివాస్, నరేష్, ఏఎస్ఐ లు, హెడ్ కానిస్టేబుల్స్, పోలీస్ సిబ్బంది, యువకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.