26-06-2025 04:33:45 PM
ఏడిఏ నీలిమ..
వలిగొండ (విజయక్రాంతి): రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించకుంటే దుకాణాలను సీజ్ చేయడం జరుగుతుందని ఏడిఏ నీలిమ(ADA Neelima) అన్నారు. గురువారం వలిగొండ మండల(Valigonda Mandal) కేంద్రంలోని పలు ఎరువులు, విత్తనాల దుకాణాలను అగ్రికల్చర్, పోలీస్ స్క్వాడ్ ఆధ్వర్యంలో దుకాణాల లైసెన్స్, బిల్లులు, స్టాక్ తనిఖీలు నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ... దుకాణదారులు తప్పనిసరిగా స్టాకు బోర్డులను, ధరల పట్టికలను ప్రదర్శించాలని లైసెన్స్ తప్పనిసరి అని రైతులు కొనుగోలు చేసిన ప్రతి ఎరువులు, విత్తనాలకు బిల్లులు అందించాలని రైతులకు కావలసిన విత్తనాల రకాలను అందుబాటులో ఉంచాలని అన్నారు.
లైసెన్సు కలిగిన దుకాణా దారుల వద్ద మాత్రమే రైతులు విత్తనాలు తీసుకోవాలని, రైతులు తప్పనిసరిగా కొనుగోలు చేసిన వాటికి బిల్లులు తీసుకోవాలని విత్తనాల విషయంలో రైతులు మోసపోయినట్లయితే వ్యవసాయ అధికారులకు తెలియజేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీబీనగర్ ఎంఏఓ పద్మ, వలిగొండ ఎంఏఓ అంజనీదేవి, వలిగొండ ఏఎస్ఐ మోహన్ పాల్గొన్నారు.