18-06-2025 10:59:43 PM
సూర్యాపేట రూరల్ సీఐ రాజశేఖర్..
పెన్ పహాడ్: భావి తరాలకు దిక్సూచిగా నిలవాల్సిన యువత చెడు ప్రవర్తనలకు లోనై గంజాయి, మత్తు బానిసై.. తమ బంగారు భవిష్యత్ ను నాశనం చేసుకుంటున్నారని సూర్యాపేట రూరల్ సీఐ రాజశేఖర్(Suryapet Rural CI Rajasekhar) అన్నారు. బుధవారం రాత్రి మండలంలోని లింగాలలో 'పోలీస్ ప్రజా భరోసా' అవగాహనా సదస్సులో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్బంగా పలు చట్టాలపై గ్రామస్తులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ గోపి కృష్ణ, హెడ్ కానిస్టేబుల్స్ యాదగిరి, మురళిధర్ రెడ్డి, పీసీ మహేష్ పాల్గొన్నారు.