18-06-2025 11:05:22 PM
చిలుకూరు: చిలుకూరు పోలీస్ స్టేషన్(Chilkur Police Station) పరిధిలోని నారాయణపురం గ్రామంలో బుధవారం సూర్యాపేట జిల్లా ఎస్పీ నర్సింహ ఐపీఎస్(District SP Narasimha), ఆదేశాల మేరకు కోదాడ రూరల్ సీఐ, జి రజిత రెడ్డి, ఆధ్వర్యంలో పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కోదాడ రూరల్ సీఐ మాట్లాడుతూ... జిల్లా పోలీస్ యంత్రాంగం మొత్తం ప్రజలతో సన్నిహితంగా ఉంటూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నదని, యువత డ్రగ్స్ కి దూరంగా ఉండాలని, చదువు విలువను గుర్తించి మంచిగా చదువుకొని నారాయణపురంకు శాంతియుతం గ్రామంగా పేరు రావాలని, అలవాటుగా నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని చట్టానికి లోబడి నడుచుకోకపోతే, క్షణికావేశంలో, క్షణిక ఆనందం కోసం తప్పులు, నేరాలు, చేస్తే జీవితకాలం, జైలు శిక్షలు అనుభవించాల్సి వస్తుందని, తగాదాల గొడవలు ఉంటే చట్ట పరిధిలో పరిష్కరించుకోవాలని, అత్యాశకు పోయి సైబర్ మోసగాళ్లకు చిక్కితే ఆర్థికంగా లూటీ అవుతారు, ప్రజలకు చట్టాల గురించి వివరించి శాంతియుత సమాజం కోసం పోలీసు ప్రజా భరోసా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు.
జరగబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాంటి గొడవలు చేయకుండా ఎన్నికలు శాంతియుతంగా జరిగేలా అందరు సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో చిలుకూరు ఎస్సై సురభి రాంబాబు, చిలుకూరు పోలీస్ సిబ్బంది, గ్రామ పెద్దలు యువత పాల్గొన్నారు.