రోడ్లపై చెత్త వేయకండి
05-03-2026 12:12 PM
తాజా మాజీ మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్ రాజుర సత్యం
ఖానాపూర్ (విజయక్రాంతి): పట్టణంలోని కాలనీలో రోడ్లపై చెత్త వేయద్దని, మున్సిపల్ వాహనంలో మాత్రమే చెత్త వేసి ప్రజలు సహకరించాలని ఖానాపూర్ 11వ వార్డు కౌన్సిలర్, తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ రాజు రా సత్యం, కమిషనర్ సుందర్ సింగ్ అన్నారు. గురువారం ఖానాపూర్ మున్సిపాలిటీలోని 11వ వార్డ్ లో అభివృద్ధి పనులను సమీక్షించారు. ఈ మేరకు పలు రోడ్లపై మురికి నీళ్లు పారుతున్నాయని, చెత్తాచెదారం డ్రైనేజీలో వేయడంతో మురికి నీరు పోయేందుకు దారి లేక డ్రైనేజీలు దుర్గంధం వెదజల్లుతున్నాయని, ప్రజలు సహకరించాలని వారు కోరారు. వీరితో పాటు శానిటేషన్ ఇన్స్పెక్టర్ ఉప్పరి పోశెట్టి, సిబ్బంది తదితరులు ఉన్నారు.




