28-06-2025 12:11:10 AM
మహిళా ఆత్మహత్యాయత్నం
మందమర్రి,(విజయక్రాంతి): మండలంలోని క్యాతనపల్లి మున్సిపాలిటీకి చెందిన మహిళ తనకు డబల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ మండల తహాసిల్దార్ కార్యాలయం ఎదుట ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన శుక్రవారం సంచలనం సృష్టించింది. బాధితురాలు తెలిపిన వివరాలు ప్రకారం క్యాతనపల్లి మున్సిపాలిటీలోని కనకదుర్గ కాలనీలో నివాసముండే పూరేళ్ళ లక్ష్మి గతంలో డబుల్ బెడ్ రూమ్ ఇంటి కోసం దరఖాస్తు చేసుకోగా మొదటి లిస్టులో తన పేరు వచ్చిందని, ఇటీవల అధికారులు విడుదల చేసిన తుది జాబితాలో తన పేరు లేకపోవడంతో ఆందోళన చెందుతుంది.
అధికారులు విడుదల చేసిన తుది జాబితా లో తన పేరు లేకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురై గత కొంతకాలంగా ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ కార్యాలయం చుట్టూ తిరుగు తుంది. ఈ క్రమంలో తనకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేసి ఆదుకోవాలని కోరుతూ మండల తహసిల్దార్ కు వినతిపత్రం అందచేసింది. తనకు వెంటనే డబల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలని కోరింది. భర్త వదిలేయడంతో ముగ్గురు పిల్లలను కూలి పనులు చేసుకుంటూ పోషించుకుంటూ అద్దె ఇంట్లో నివసిస్తున్నానని తనకు ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలని అధికారులను వేడుకుంది.
దీనిపై తహసిల్దార్ మాట్లాడుతూ విచారణ జరిపి న్యాయం చేస్తానని హామీ ఇచ్చినప్పటికీ సంతృప్తి చెందనీ ఆమె కార్యాలయం బయటికి వచ్చి తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ ను ఒంటిపై పోసుకొని నిప్పంటికుకునే ప్రయత్నం చేయగా అప్రమత్త మైన కార్యాలయం సిబ్బంది అగ్గిపెట్టను తీసుకొని దూరంగా పడేయడంతో పెను ప్రమాదం తప్పింది. సిబ్బంది పోలీసులకు సమాచారం అందించగా, పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని బాదిత మహిళకు తగిన న్యాయం చేస్తామని బరోసా ఇచ్చి ఆమెను అసుపత్రికి తరలించారు. ఇదిలా ఉండగా బాధిత మహిళ ఆత్మహత్యా ప్రయత్నం చేసుకున్న ఘటనపై స్పందించిన తహసిల్దార్ సతీష్ కుమార్ మాట్లాడుతూ బాధిత మహిళ ఇచ్చిన వినతి పత్రంపై శనివారం క్షేత్రస్థాయి లో విచారణ జరిపి తగిన న్యాయం చేస్తానని స్పష్టం చేశారు.