28-06-2025 12:10:25 AM
కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ
నార్సింగి(చేగుంట) జూన్ 27 : కాంగ్రెస్ ప్రభుత్వంలోనే గ్రామాలు, మండలాలు అభివృద్ధి జరుగుతుందని మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు స్పష్టం చేశారు. నార్సింగి పట్టణ కేంద్రంలోని రైతు వేదికలో తహశీల్దార్ షేక్ కరీం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే రోహిత్ పాల్గొన్నారు.
నార్సింగి మండల పరిధిలో 10 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే రోహిత్ మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకు పోతోందని, నియోజకవర్గంలో నార్సింగి, శంకరంపేట్ మండలాలను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీడీఓ ఆనంద్, ఐకేపీ ఏపీఏం అశోక్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుడు డాక్టర్ రవి కుమార్, టిపిసిసి సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి యాదగిరి యాదవ్, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు గోవర్ధన్, బీసీ సెల్ ఉపాధ్యక్షుడు కేశవులు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రాజేందర్ రెడ్డి, టెలికాం బోర్డు మాజీ సభ్యుడు అంచనూరి రాజేష్, పార్టీ నాయకులు చాంద్ పాషా, రుక్ముద్దీన్, చందూ యాదవ్, జహీర్, భరత్, లక్ష్మీ నరసింహులు, బాలాజీ పాల్గొన్నారు.