17 April, 2026 | 12:10 PM

Breaking News

హరివంశ్ రాజ్యసభ ఉపసభాపతిగా ఏకగ్రీవం   •   ఏడేళ్లుగా డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీగా ఉంచడంలో అర్థమేంటీ?   •   హన్మకొండ జిల్లా అక్రిడిటేషన్ కమిటీ ఖరారు   •   ఉపాధి హామీ కూలీలకు త్రాగునీటి ఇబ్బంది లేకుండా చూడండి   •   కీలక బిల్లులపై సర్వత్రా ఉత్కంఠ! లోక్‌సభలో 4 గంటలకు ఓటింగ్   •   రేవంత్ రెడ్డి హైబ్రిడ్ ఫార్ములా కాదు.. అది అసదుద్దీన్ ఓవైసీ ఫార్ములా   •   సోనాల మండల కేంద్రంలో నిఘా నేత్రాల ఏర్పాటు   •   డిల్లీ లో వేం నరేందర్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే జారె   •   రోడ్డు భద్రతా ప్రమాణాలపై ఐజీ చంద్రశేఖర్ రెడ్డితో సమావేశం   •   వృద్ధుల కోసం వైద్య సేవలు అందించడం ఎంతో అవసరం   •  

ప్రతి ఒక్కరిలో క్రీడాస్ఫూర్తి ఉండాలి

28-06-2025 12:11 AM

డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 27 (విజయక్రాంతి): జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో కార్పొరేటర్లు, ఉద్యోగులు, ప్రెస్ రిపోర్టర్ల కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న స్పోర్ట్స్‌మీట్ శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. గ్రేటర్ హైదరాబాద్ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి షటిల్ బ్యాడ్మింటన్ మ్యాచ్‌లో పాల్గొని అందరిలో ఉత్సాహం నింపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..

జీహెచ్‌ఎంసీ నిర్వహించిన ఈ ప్రత్యేక క్రీడా కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు. ఈ స్పోర్ట్స్‌మీట్ ద్వారా కార్పొరేటర్లు, ఉద్యోగులు, ప్రెస్ రిపోర్టర్ల మధ్య ఐక్యత ఏర్పడిందని తెలిపారు. జీహెచ్‌ఎంసీ చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా ప్రతిఒక్కరిలో క్రీడాస్ఫూర్తి పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమం విజయవంతంగా సాగాలని ఆకాంక్షించారు.