02-06-2025 01:13:49 AM
కామారెడ్డి , జూన్ 1 (విజయక్రాంతి): చేసిన అప్పులు తీరక పోవడంతో పాటు మహిళలకు ఉచిత బస్సుతో ఆటో నడవక మరిన్ని అప్పులు ఎక్కువ అయి జీవితం పై విరక్తి చెందిన ఓ ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన కామారెడ్డి మండలం గర్గుల్ గ్రామంలో చోటు చేసు కుంది. గ్రామస్తులు, కుటుంబీకుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామా నికి చెందిన గుంటికాడి నర్సింలు ఆటోనడుపుతూ జీవనం సాగిస్తున్నాడు.
అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళలకు ఉచిత బస్సు పథకంతో ఆటో నడవకపోవడంతో కుటుంబాన్ని సాకడానికి అప్పుల పాలయ్యాడు. అంతకు ముందే అప్పులు ఉండగా ఆటో నడవకపోవడంతో ఫైనాన్స్ కిస్తీలు కట్టడానికి డబ్బులు లేక మరిన్ని అప్పులు కావడంతో జీవితం పై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో అతని కుటుంబం వీధిన పడింది. బాధితుని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఆటో డ్రైవర్ల సంఘం నాయకులు కోరారు.