24-10-2025 07:24:06 PM
కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండలంలోనీ బీబీపేట్ రోడ్ లో SHG సంఘ సభ్యురాలు టీ, స్నాక్స్, మీల్స్ హోటల్ ను శుక్రవారం డీఆర్డీఓ సురేందర్ చేతుల మీదుగా ప్రారంభించారు. హోటల్ యజమానురాలు అఫిజాతో మాట్లాడుతూ... ప్రతి రోజు క్వాలిటీ తో ఉన్నవి, రోజు వారిగా మంచి పోషకాలతో కూడిన వంటలు ఉండాలి. పరిశుభ్రత పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీపీఎంస సాయిలు, ఎపీఎం శ్రీనివాస్, సీసీలు హోటల్ సిబ్బంది పాల్గొన్నారు.