9 April, 2026 | 9:32 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

కమ్యూనిస్టు పార్టీ శతాబ్ది ముగింపు ఉత్సవాలకు ఆటోడ్రైవర్లు విరివిగా విరాళాలు

24-10-2025 06:38 PM

కొత్తగూడెం,(విజయక్రాంతి): కమ్యూనిస్టు పార్టీ శతాబ్ది ముగింపు ఉత్సవాలకు ఆటోడ్రైవర్లు విరివిగా విరాళాలు అందించాలని కంచర్ల జమలయ్య కోరారు. శుక్రవారం కొత్తగూడెం పట్టణంలో శేషగిరి భవన్ లో ఆటో డ్రైవర్ల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, భారత కమ్యూనిస్టు పార్టీ రాజీలేని పోరాటాలు చేస్తున్నందున ఆనాడు పార్టీపై నిషేధo విదిoచారు. భారత కమ్యూనిస్టు పార్టీ నాయకుల పై కేసులు పెట్టి జైల్లో  నిర్బంధించారు.

అయినప్పటికీ కార్మిక విద్యార్థి యువజన రైతు మహిళ తదితర ప్రజాసంఘాలు నిర్మించి వేట్టి చాకీరీ విముక్తి కలిగించి,భారత దేశ రాజకీయ చరిత్రలో సిపిఐ తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నదన్నారు. ఖమ్మం జిల్లా కమ్యూనిస్టులకు పుట్టినిల్లు, రామనాథం, దేవనూరు, శేషగిరిరావు, నల్లమల్ల గిరిప్రసాద్, మహమ్మద్ రజబలి తదితర పోరాటయోధులు మన ఖమ్మం వాసులు కావటం గర్వకారణం. తొలి నుంచి కమ్యూనిస్టులను కన్నతల్లిలా ఆదరించి, అనేక విజయాలను అందించిందన్నారు.