2 July, 2026 | 3:02 PM

Breaking News

కాంగ్రెస్ నేతలు తోక ముడిచారు: చేతగానోళ్లు ఎందుకు మాట్లాడాలి?: కేటీఆర్   •   గ్రామ గ్రామాన ఇల్లు నిర్మించిన ఘనత ప్రజాపాలనదే: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి   •   మాది రైతు ప్రభుత్వం: నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి   •   కల్వకుంట్ల కవిత అరెస్టుపై మండిపడ్డ చెరుకుపల్లి శైలజ   •   గీతం విద్యార్థులకు పిలుపు   •   గోండి భాష పరిరక్షణకు కృషి: ఐటీడీఏ ఏపీవో ఆత్రం భాస్కర్   •   తంగళ్లపల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా మునిగెల రాజు నియామకం   •   ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యం   •   పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గం: కేటీఆర్   •   మణికొండ మాజీ వైస్‌ చైర్మన్‌ ఇంట్లో ఏసీబీ సోదాలు   •  

తాగునీరు వృధా అయ్యేను చూడు

09-09-2024 10:14 AM

అధికారుల నిర్లక్ష్యంతో నేలపాలవుతున్న తాగునీరు 

భద్రాద్రి కొత్తగూడెం, విజయక్రాంతి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న లక్ష్మీదేవిపల్లి మండలం శ్రీరామచంద్ర ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో మిషన్ భగీరథ తాగునీరు నేలపాలవుతోంది. స్వచ్ఛమైన తాగునీటిని ఇంటింటికి అందించాలని లక్ష్యంతో ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ మంచినీటి పథకంపై పరవేక్షణ కొరవడింది అనడానికి చక్కని నిదర్శనం ఈ దృశ్యం. మెయిన్ పైపులైను ఆన్ చేసిన తర్వాత ట్యాంకు నిండిన వెంటనే పైపులను ఆఫ్ చేయాల్సి ఉంది. కానీ ఆన్ చేసి వదలడంతో ట్యాంకు నిండి వృధాగా నీరంతా పొర్లిపోతోంది. సంబంధిత అధికారులు ఇప్పటికైనా మిషన్ భగీరథ పథకంపై పర్యవేక్షణ చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.