31-05-2025 10:14:53 PM
సూర్యాపేట (విజయక్రాంతి): డ్రగ్స్ నిర్మూలన ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని జిల్లా ఎస్పీ కే.నరసింహ(District SP K. Narasimha) అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన పోస్టర్ ను అవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... సమాజంలో డ్రగ్స్, గంజాయి అనేవి వినాశకాలు, ఇవి యువత జీవితాలను నాశనం చేస్తున్నాయి అన్నారు. మన సమాజం నుండి వీటిని నిర్మూలించాల్సిన బాధ్యత అందరిపై ఉన్నదన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పి రవీందర్ రెడ్డి, సూర్యాపేట డిఎస్పీ ప్రసన్న కుమార్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ నాగభూషణరావు, సీసీఎస్ ఇన్స్పెక్టర్ శివ కుమార్, ఐటీ కోర్ ఆర్ ఎస్ఐ రాజశేఖర్, సిబ్బంది ఉన్నారు.