31-05-2025 10:17:00 PM
కామారెడ్డి టౌన్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో నలుగురు అధికారులు శనివారం పదవి విరమణ పొందారు. పదవీ విరమణ పొందిన అధికారులను కామారెడ్డి జిల్లా కలెక్టరేట్లో శనివారం సత్కరించారు. పదవి విరమణ పొందిన అధికారులలో జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి భీమ్ కుమార్, ఎల్లారెడ్డి ఆర్డిఓ ప్రభాకర్, కలెక్టరేట్ సూపరిండెటెంట్ జయంత్ రెడ్డి, దోమకొండ ఎమ్మార్వో సంజయ్ రావు పదవి విరమణ పొందారు. వారిని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్(District Collector Ashish Sangwan), జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్ ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు.