calender_icon.png 2 June, 2025 | 12:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పొగాకు వాడకం మాకోవాలి..

31-05-2025 10:13:00 PM

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ రాజ్యలక్ష్మి..

అదిలాబాద్ (విజయక్రాంతి): పోగాకు వాడకం మానేసి ఆరోగ్యవంతమైన జీవితాన్ని అవలంబించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ రాజ్యలక్మి అన్నారు. ప్రపంచ పొగాకు నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పొగాకు ఉత్పత్తుల వాడకం వలన అనారోగ్య సమస్యలతో పాటు ఆర్థికంగా నష్టం జరుగుతుందన్నారు. కుటుంబ శ్రేయస్సు కోసం చెడు అలవాట్లను మానాలని సూచించారు. వైద్య సహాయం కోసం ఆరోగ్య కేంద్రాలను సందర్శించాలని తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి నరేందర్ రాథోడ్ మాట్లాడుతూ... ఆరోగ్యమే మహా భాగ్యం అన్నారు.

ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలను వినియోగించూకోవాలని కోరారు. ఈ సందర్భంగా పారిశుధ్య కార్మికులకు ఓరల్ హెల్త్ మరియు క్యాన్సర్ గుర్తింపు కార్యక్రమం నిర్వహించారు. తదనంతరం జిల్లా పొగాకు నియంత్రణ అధికారి డాక్టర్ శ్రీధర్ మెట్పల్లివార్ మాట్లాడుతూ.. ప్రతి రోజు ప్రపంచవ్యాప్తంగా 14 వేలకు పైగా, భారతదేశంలో ప్రతిరోజు 3600 పొగాకు సంబంధిత వ్యాధుల ద్వారా మరణాలు సంభవిస్తున్నాయి, అందుకని పొగాకు వాడకాన్ని నియంత్రించడానికి భారత ప్రభుత్వం 2004లో COTPA Act  చట్టాన్ని ప్రవేశపెట్టడం జరిగింది అని అన్నారు. ఈ కార్యక్రమంలో, జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ సుమలత, డాక్టర్ వినోద్, డాక్టర్ ఇఫ్ఫాత్, డాక్టర్ శ్రీనివాస్,దంత వైద్యులు షామిఉదిన్, ఎక్క్యూటివ్ ఇంజనీర్ బివిఎస్ రాజు, జిల్లా టొబాకో కంట్రోల్ సెల్ కౌన్సిలర్ శ్రీకాంత్, చిరంజీవి, సానిటరీ ఇన్స్పెక్టర్ శంకర్, ఆరోగ్య సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.