19-11-2025 12:00:00 AM
కొత్తపల్లి, నవంబరు 18 (విజయక్రాంతి) : నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమము ప్రారంభమై 5సంవత్సరాలు పూర్తయిన సందర్బంగా మంగళవారం నగునూరులోని ప్రతిమ వైద్య కళాశాలలో 1000 మందితో మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా సామూహిక ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా అదనపు కలెక్టర్ అశ్విని తనాజీ వాకడే, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, జిల్లా అధికారులు, కళాశాల యాజమాన్యం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ మత్తు పదార్థాలు మానవ సంబంధాలను ఆరోగ్యాలను నాశనం చేస్తున్నాయన్నారు. విద్యార్థులు వాటికీ దూరంగా ఉండాలన్నారు ప్రతిమ వైద్య కళశాల విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
ఈ కార్యక్రమం డి డబ్ల్యువో కె. సబితా కుమారి, ఎక్సైజ్ సూపరిడెంట్ టి. శ్రీనివాస్ రావ్ గారు, డిఎంహెచ్ఓ వెంకట రమణ, వివో సనా, నషా ముక్త్ భారత్ అభియాన్ కమిటీ మెంబెర్ కేశవరెడ్డి, కమ్యూనిటీ ఎడ్యుకేటర్ కుతాడి తిరుపతి, ఈగల్ నోడల్ ఆఫీసర్ పుల్లయ్య, ప్రతిమ కళాశాల యాజమాన్యం డా. రామ చందర్, డా. సి.యన్. ప్రసాద్, డా.జాన్ ఇస్రయిల్, టి.కె.కె. నాయుడు, డా.కిషన్ రెడ్డి, రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.