20-05-2025 02:54:19 AM
హైదరాబాద్, మే 19 (విజయక్రాంతి): తెలంగాణ పోలీసు శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 77 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ జితేందర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణమే ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని తెలిపారు. బాలానగర్ ఏసీపీగా నరేశ్రెడ్డి, శంషాబాద్ ఏసీపీగా శ్రీకాంత్రెడ్డి, మాదాపూర్ ఏసీపీగా సీహెచ్ శ్రీధర్, చిక్కడపల్లి ఏసీపీగా శ్రీకాంత్, మేడ్చల్ ఏసీపీగా శంకర్రెడ్డి, సంతోష్నగర్ ఏసీపీగా సుఖ్దేవ్సింగ్, హుజూరాబాద్ డీఎస్పీగా మాధవి, కామారెడ్డి డీఎస్పీగా శ్రీనివాసరావు, పటాన్చెరు ఏసీపీగా ప్రభాకర్, సిద్దిపేట ఏసీపీగా రవీందర్రెడ్డి, కూకట్ పల్లి ఏసీపీగా రవికిరణ్రెడ్డి, పేట్బషీర్బాద్ ఏసీపీగా బాలగంగిరెడ్డి, మహే శ్వరం ఏసీపీగా జానకిరెడ్డి, షాద్నగర్ ఏసీపీగా లక్ష్మినారాయణ సహా 77 మందిని డీజీపీ బదిలీ చేశారు.