28 June, 2026 | 3:11 PM

Breaking News

రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాలు ఆయనకు కనపడట్లేదు   •   ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు   •   135వ మన్ కీ బాత్.. యువతలోని సృజనాత్మకతకు పెద్దపీట: ప్రధాని మోదీ   •   రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •  

సమ్మెకాలానికి వేతనం చెల్లింపు

20-05-2025 02:51 AM
  1. వర్సిటీ వీసీలకు ప్రభుత్వం ఆదేశాలు
  2. సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన అధ్యాపక సంఘాలు

హైదరాబాద్, మే 19 (విజయక్రాంతి): సమ్మె కాలానికి అధ్యాపకు లకు వేతనం చెల్లించాలని వర్సిటీ వీసీలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయ డంపై కాంట్రాక్టు అధ్యాపక సంఘాలు హర్షం వ్యక్తంచేశాయి. ఈమేరకు సో మవారం ఒక ప్రకటన విడుదల చేశా యి. సీఎం, ఉన్నతవిద్యామండలి చైర్మన్‌కు కాంట్రాక్టు అధ్యాపకుల సంఘా లు కృతజ్ఞతలు తెలిపాయి. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ రాష్ర్టవ్యాప్తంగా ఉన్న వర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులు గతంలో సమ్మె చేపట్టిన విషయం తెలిసిందే.

ఈనేపథ్యంలో వర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకుల సమ్మె కాలానికిగాను కోత విధించిన 11 రోజులు వేతనాల ను తిరిగి వెంటనే చెల్లించాలని ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి రాష్ర్టంలోని 12యూనివర్సిటీల వైస్ చాన్స్‌లర్లకు ఆదేశాలు జారీచేశారని కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం నాయకులు డాక్టర్ పరశురామ్, డాక్టర్ ధర్మతేజ తెలిపారు. అలాగే కొత్తగా పదవీ బాధ్యతలు స్వీకరించిన  ప్రభు త్వ సీఎస్ రామకృష్టారావును మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు చెప్పారు. కాంట్రాక్టు అధ్యాపకుల పెం డింగ్ సమస్యలను పరిష్కరించాలని వారు సీఎస్‌ను కోరారు.