16-02-2026 12:50:00 PM
కన్నాల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో తెలంగాణ ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలి
శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిల్ల శ్రీను బాబు
మంథని,(విజయ క్రాంతి): మంథని మండలంలోని కన్నాల గ్రామంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామిని సోమవారం టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలు బాగుండాలనీ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని, రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని స్వామివారిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు భక్తులు పాల్గొన్నారు.