31-05-2025 10:34:09 PM
సారంగాపూర్ (విజయక్రాంతి): మండలంలోని వంజర్ గ్రామ వరి కొనుగోలు కేంద్రంలో ధాన్యం తరలింపునకు లారీలు అందుబాటులో లేకపోవడంతో శనివారం రైతులు సొంత ఖర్చులతో ట్రాక్టర్ కిరాయికి తెచ్చుకుని ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తున్నారు. ఒక పక్క వర్షంతో మరోపక్క లారీల కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయంలో ఏమి మిగుల్బాటు ఉండడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లారీ లైన, ట్రాక్టరు లైన కొనుగోలు కేంద్రానికి వచ్చి, ధాన్యం సంచులను తీసుకెళ్ళాలంటే, సంచికి మూడు రూపాయల చొప్పున అదనంగా ప్రత్యేక డబ్బులు ఇవ్వాలంటూ వాహన యజమానులు రైతులను డిమాండ్ చేస్తున్నారని సమాచారం. సంబంధిత శాఖ అధికారులు ఈ విషయంపై స్పందించి ఎలాంటి అవకతవకలు జరగకుండా చూసుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.