31-05-2025 10:36:13 PM
కార్వాన్: గోల్కొండ జగదాంబికా అమ్మవారి ఆలయ(Golconda Jagadambika Ammavari Temple) ట్రస్ట్ కమిటీ చైర్మన్ కే. చంటిబాబు ఆధ్వర్యంలో సభ్యులు శనివారం పలువురు మంత్రులను కలిశారు. గోల్కొండ బోనాల ఉత్సవాలకు హాజరుకావాలని ఆహ్వానించారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్ తో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత రోహిన్ రెడ్డిని కలిశారు. ఈ సంవత్సరం గోల్కొండ బోనాలను మరింత వైభవంగా నిర్వహించాలని ఈ సందర్భంగా మంత్రులు ట్రస్ట్ చైర్మన్ చంటిబాబుతో సభ్యులకు సూచించారు.
తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని వారు హామీ ఇచ్చినట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి లోటుపాట్లు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా చైర్మన్ చంటిబాబు ఆధ్వర్యంలో కార్వాన్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ శశిరేఖను కూడా కలిశారు. జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో కల్పించే వసతుల విషయంలో చర్చించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు నాగులపల్లి శ్రీకాంత్, సంతోష్ గౌడ్, ఆకుల ప్రదీప్ కుమార్, సింగ జోగి యాదగిరి డి అనిత తదితరులు పాల్గొన్నారు.