13 April, 2026 | 1:29 PM

Breaking News

దశాబ్దాల నిరీక్షణకు ముగింపు— మహిళా రిజర్వేషన్ల చట్టంపై ప్రధాని మోదీ   •   వివాహ వేడుకలో తీవ్రవిషాదం— బస్సు, ట్రక్కు ఢీ: ఆరుగురు మృతి   •   మండల ప్రజల సమస్యలు త్వరితగతిన పరిష్కరించండి   •   నోయిడా కార్మికుల నిరసన హింసాత్మకం... వాహనాలకు నిప్పు   •   గ్రామీణ వైద్యులకు షోకాజ్ నోటీసులు జారీ   •   నెట్‌వర్కింగ్ మార్కెటింగ్ ఒత్తిడి: యువకుడి ఆత్మహత్య   •   బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు; కార్మికులు చిక్కుకున్నట్లు అనుమానం?   •   గుజరాత్‌లో భయానక ప్రమాదం! యాత్రికులపైకి ట్రక్కు దూసుకెళ్లి 7 మృతి – అసలు ఏమైంది?   •   కొల్కూర్ గ్రామంలో తొలిసారి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ   •   ఇంటర్ ఫలితాల్లో రిషి విద్యార్థుల ర్యాంకుల పంట   •  

బాధ్యతగా విధులు నిర్వర్తించాలి

13-05-2024 12:37 AM

ఎన్నికల అధికారి ముజమ్మిల్ ఖాన్

మంథని, మే12 (విజయక్రాంతి): లోకసభ ఎన్నికల పోలింగ్ సిబ్బంది విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలని పెద్దపల్లి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచించారు. ఆదివారం రామగిరి మండలంలోని మంథని జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల, రామగుండంలోని ఎన్టీపీసీ టీటీఎస్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోలింగ్ సామగ్రి పంపిణీ చేసే సమయంలో అప్పమత్తంగా ఉండాలని కోరారు. రిజర్వ్ ఈవీఎం యంత్రాలు, రిజర్వు పోలింగ్ సామగ్రి సెక్టార్ అధికారుల వద్ద భద్రంగా ఉండాలని సూచించారు. పెద్దపల్లి పార్లమెంట్ నియోజ కవర్గంలో 1,850 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఓటర్లు అందరూ తప్పని సరిగా నేడు ఓటు హక్కు వినియోంచుకోవాలని కోరారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అరుణశ్రీ, మంథని ఎన్నికల అధి కారి(ఆర్డీఓ) హనుమానాయక్ తదిరతులు పాల్గొన్నారు.