06-09-2025 05:58:30 PM
బెల్లంపల్లి అర్బన్: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి సింగరేణి ఏరియా హాస్పిటల్ Dy CMO శ్రీ పాండు రంగాచారి ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పనిచేసిన డివైసీఎంవో మధుకర్ రామకృష్ణాపూర్ ఏరియా ఆసుపత్రికి బదిలీ అయ్యారు. అక్కడ పనిచేసిన పాండురంగ చారి బెల్లంపల్లి ఏరియా ఆపత్రికి వచ్చారు.
డివైసీఎంవోకి సన్మానం...
బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రి డివైసీఎంఓగా బాధ్యతలు చేపట్టిన పాండురంగాచారిని, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్, (AITUC) సెంట్రల్ కమిటీ సభ్యులు మిట్టపల్లి వెంకటస్వామి,రెండు బ్రాంచ్ ల ఇంచార్జి సీనియర్ నాయకులు చిప్ప నర్సయ్య,బెల్లంపల్లి బ్రాంచ్ కార్యదర్శి, దాగం మల్లేష్, మర్యాదపూర్వకంగా సన్మానం చేశారు.