23 నుంచి ఎప్సెట్ హాల్టికెట్లు
23-04-2026 01:40 AM
హైదరాబాద్, ఏప్రిల్ 22 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశాలకు నిర్వహించే ఎప్సెట్-2026 హాల్ టికెట్లు ఏప్రిల్ 23 నుంచి అందుబాటులో ఉంటాయని జేఎన్టీయూ వర్సిటీ తెలిపింది. ఏప్రిల్ 23 నుంచి అగ్రికల్చర్, ఫార్మసీ విద్యార్థులకు హాల్ టికెట్స్ అందుబాటులో ఉండగా 27 నుంచి ఇంజనీరింగ్ పరీక్షల హాల్ టికెట్స్ అందుబాటులో ఉండనున్నాయి.
మే 4 నుంచి ప్రారంభం కానున్న ఈ పరీక్షలకు 3 లక్షల 11 వేల 94 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. మే 4, 5 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు ఉండగా, మే 9 నుంచి 11 వరకు ఇంజనీరింగ్ విభా గం పరీక్షలు రెండు సెషన్స్లో జరగనున్నాయి.






