15 March, 2026 | 10:53 PM

Breaking News

'దావత్-ఎ-ఇఫ్తార్' విందులో పాల్గొన్న నేతలు   •   విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •  

అక్రమ రుణాల కేసులో ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ

31-07-2024 07:20 PM

హైదరాబాద్: అక్రమ రుణాల కేసులో ఆస్తులను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసింది. వెంకటరామ్మోహన్ రావుకు చెందిన రూ.19.11 కోట్ల ఆస్తులు అటాయి చేసిన ఈడీ వాటి మార్కెట్ విలువ సుమారుగా రూ.71.61 కోట్లు ఉంటుందని వెల్లడించింది. గతంలో వెంకటరామ్మోహన్ రావు ఐడీబీఐ వద్ద అక్రమంగా రూ.311 కోట్లు రుణాలు తీసుకున్నట్లు గుర్తించింది. ఈ కేసులో వెంకటరామ్మోహన్ సహా 11 మంది నిందితులు బ్యాంక్ అధికారులతో కలిసి ఫోర్జరీ దస్త్రాలతో రుణాలు తీసుకున్నట్లు గుర్తించిన ఈడీ అధికారులు తెలిపారు. వీరికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న ఆస్తులను అటాచ్ చేసినట్లు ఈడీ అధికారులు పేర్కొన్నారు.