2 September, 2026 | 11:23 PM

Breaking News

పెరిక్స్ పై ఇన్కమ్ టాక్స్ రద్దుకు అంగీకరించిన యాజమాన్యం   •   రెవరెండ్ డాక్టర్ గుండెపాక వెంకన్నకు ది ఐకానిక్ ఇండియా అవార్డు   •   గంజాయి సాగుచేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు   •   శేషగిరిరావును పరామర్శించిన జనసేన రాష్ట్ర నాయకులు డా గడల శ్రీనివాసరావు   •   నాలుగు క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత   •   అక్రమ కేసులు ఎత్తివేయాలి: రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రామచందర్‌రావు   •   కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ నిరసన   •   క్యాంప్ ఆఫీస్‌పై దాడి హేయమైన చర్య: ఎమ్మెల్యే కుంభం   •   మునిప‌ల్లి ఎస్సీ హాస్ట‌ల్‎ను త‌నిఖీ చేసిన చైర్మ‌న్, మండ‌ల ప్ర‌త్యేకాధికారి   •   పదవులు నా వెంట రావాలి.. భవిష్యత్ సీఎం నేనే!   •  

రౌడీషీటర్ ఆస్తులను జప్తు చేసిన ఈడీ

19-10-2024 | 02:00am

మహ్మద్ కైసర్‌కు చెందిన రూ. కోటి విలువైన ఆస్తుల అటాచ్

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 18 (విజయక్రాంతి) : రాష్ట్రంలోనే మొదటిసారిగా రౌడీషీటర్ ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు జప్తు చేశారు. హబీబ్‌నగర్‌కు చెందిన రౌడీషీటర్ మహ్మద్ కైసర్ జేబు దొంగగా జీవితాన్ని మొదలు పెట్టి.. ఇప్పుడు పేరుమోసిన రౌడీ షీటర్‌గా భారీగా ఆస్తులు కూడబెట్టాడు.

పలు సెటిల్‌మెంట్లు, నేరాల్లో వచ్చిన డబ్బులను హవాలా మార్గంలో కైసర్ స్వీకరించినట్లు ఈడీ గుర్తించింది.  అలాగే ఆయన భార్య షాహెదా బేగం పేరు మీద అనేక స్థిరాస్తులు ఉన్నట్లు ఈడీ గుర్తించింది. ఈ క్రమంలో శుక్రవారం మహ్మద్ కైసర్‌కు చెందిన సుమారు రూ. కోటి విలువ చేసే ఆస్తులను ఈడీ అధికారులు అటాచ్ చేసిన ట్లు పేర్కొన్నారు.

2007 నుంచి ఇప్పటివరకు హత్య, హత్యాయత్నం, దోపిడీ, జూదం, క్రికెట్ బెట్టింగ్, ల్యాండ్ సెటిల్‌మెంట్ వంటి అనేక నేరాల్లో మహ్మద్ కైసర్ ప్రమేయం ఉంది. 2011లో సంవత్సరంపాటు నగర బహిష్కరణకు కూడా గురయ్యాడు. మహ్మద్ కైసర్‌పై క్రిమినల్ రికార్డ్ ఉంది. అతనిపై వివిధ పోలీస్‌స్టేషన్‌లలో అనేక ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి.