03-05-2025 06:37:13 PM
ప్రతి జిల్లాకు ఇంటిగ్రేటెడు విద్యాలయం..
పదవ తరగతి టాపర్లును సన్మానించిన షబ్బీర్ అలీ..
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ..
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో పదవ తరగతిలో టాపర్లుగా రాణించిన విద్యార్థులను శనివారం కామారెడ్డి పట్టణంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ అలీ(Government Advisor Mohammed Ali Shabbir Ali), జిల్లా గ్రంథాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో పదవ తరగతిలో రాష్ట్ర స్థాయి ర్యాంక్ ప్రసాదించిన వారికి నగదు పారితోషకం అందించి సన్మానం చేశారు. కామారెడ్డి ఎస్పీఆర్ స్కూల్ కు చెందిన రాష్ట్ర టాపర్ నిమ్మ అణిచిత 596 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో టాపర్ గా నిలిచారు. కొండ గాయత్రి ఎస్పీఆర్ స్కూల్, కామారెడ్డి 590 మార్కులు సాధించారు.
తడుపునూరి శ్రీనిత ఎస్పీఆర్ స్కూల్ 590 మార్కులు సాధించారు. బి రమేష్ ఎం జె పి ఎర్ర పహాడ్ తాడవాయి మండల్ టాపర్ 587 మార్కులు సాధించారు. మౌర్య ఆనంద్ రెడ్డి ఎం జి పి ఎర్రపాడు 581 మార్కులు, తాడ్వాయి మండల్ సాధించారు. టీ నిక్షియా టిఎన్ఆర్ ఇజేఎస్. లింగంపేట్ మండల్ 581 మార్కులు సాధించారు. జి బావిక, జిల్లా పరిషత్ హై స్కూల్, కల్వరాల్, 581 మార్కులు సదాశివ్ నగర్ మండల్ సాధించారు. సభా తపస్సు జిల్లా పరిషత్ హై స్కూల్ మాచారెడ్డి 581 మార్కులు సాధించగా వీరిని అభినందించారు. ఈ సందర్భంగా షబ్బీర్ ఆలీ మాట్లాడుతూ... తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యాశాఖపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. జిల్లాకు ఒకటి ఇంటర్గ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూలు మొదలు పెట్టమన్నారు.
ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రభుత్వ విద్యాలయాల్లో విద్యార్థుల సంఖ్య పెంచే కార్యక్రమం చేపట్టాలని గ్రామ గ్రామాన తిరిగి విద్యార్థుల తల్లిదండ్రులను కలిసి వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేలా కౌన్సిలింగ్ చేయాలన్నారు అలాగే ప్రభుత్వ ఉద్యోగులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలి అన్నారు. ఇంత వరకు పదో తరగతిలో సబ్జెక్టుల వారీగా గ్రేడ్లతో పాటు సీజీపీఏ ఇచ్చేవారు. కానీ..ఇకపై సబ్జెక్టుల వారీగా మార్కులు, గ్రేడ్లు ఇవ్వనున్నారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కైలాస శ్రీనివాస్ రావు, మాజీ సి డి సి చైర్మన్ కారంగుల అశోక్ రెడ్డి, మాజీ జెడ్పిటి సి నిమ్మమోహన్ రెడ్డి, ఎస్ పి ఆర్ స్కూల్ ప్రొప్రైటర్ మారుతి, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.