15 March, 2026 | 10:32 PM

Breaking News

'దావత్-ఎ-ఇఫ్తార్' విందులో పాల్గొన్న నేతలు   •   విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •  

ఆర్టీసీ జేఏసీ చైర్మన్‌గా ఈదురు వెంకన్న

07-08-2024 03:04 AM

హైదరాబాద్, ఆగస్టు 6 (విజయక్రాంతి): తమ సమస్యల సాధనకు ఆర్టీసీ కార్మిక సంఘా లు ఏకగ్రీవంగా ముందుకు సాగుతాయని ఆర్టీసీ జేఏసీ నూతన చైర్మన్ ఈదురు వెంకన్న తెలిపారు. ప్రభుత్వం తమ సమస్యల పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో తామం తా జేఏసీగా ఏర్పాటై భవిష్యత్తు కార్యాచరణకు సిద్ధమైనట్టు వెల్లడించారు.

మంగళవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆర్టీసీ కార్మిక సంఘాల సమావేశంలో ఎంప్లాయీస్ యూనియన్, తెలంగాణ మజ్దూ ర్ యూనియన్, నేషనల్ మజ్దూర్ యూనియ న్, బహుజన కార్మిక యూనియన్, బహుజన వర్కర్స్ యూనియన్, కార్మిక పరిషత్ యూనియన్లు.. ఎంప్లాయీస్ యూని యన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈదురు వెంకన్నను జేఏసీ చైర్మన్‌గా ఎన్నుకున్నాయి.

వైస్ చైర్మన్‌గా తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి థామస్‌రెడ్డి, కన్వీనర్‌గా నేషనల్ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎండీ మౌలానా, కో కన్వీనర్లుగా బహుజన కార్మిక యూనియన్ ప్రధాన కార్యదర్శి సుద్దాల సురేశ్, కార్మిక పరిషత్ ప్రధాన కార్యదర్శి బీ యాదగిరిని ఎన్నుకున్నట్టు ఈదురు వెంకన్న తెలిపారు. ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించామని, తదుపరి కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తామని వివరించారు.