01-02-2026 06:07:39 PM
చింతమడకలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం
సిద్దిపేట రూరల్: తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, పదేళ్లపాటు అభివృద్ధి చేసిన మాజీ సీఎం కేసీఆర్కు ఫోన్ టాపింగ్ కేసులో సిట్ నోటీసులు ఇవ్వడం దారుణమని చింతమడక గ్రామ సర్పంచ్ మోత్కు లతా శంకర్, మాజీ సర్పంచ్ హంసకేతన్ రెడ్డి విమర్శించారు. ఆదివారం కేసీఆర్ స్వగ్రామం చింతమడకతో పాటు సీతారాంపల్లి మాచాపూర్ గ్రామాల్లో సర్పంచులు, గ్రామ శాఖ అధ్యక్షులు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.
తెలంగాణ కోసం చావు నోట్లో తలపెట్టి పోరాడిన నాయకుడిని విచారణ పేరుతో వేధించడం తగదని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లు గుమ్మడి బాల్ రాజు, చింతల రత్నాకర్ గౌడ్, మాజీ సర్పంచ్ లు ఎర్రోళ్ల శేఖర్ పంజా బాలయ్య, మిట్టపల్లి ఎల్లవ్వ బీఆర్ఎస్ నాయకులు రెడ్డి యాదగిరి, పోచంపల్లి కనకయ్య, ప్రసాద్ చెప్యాల మహేష్, రంగు సంతోష్ తదితరులు పాల్గొన్నారు.