calender_icon.png 1 February, 2026 | 7:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం

01-02-2026 06:04:26 PM

 బిఆర్ఎస్ పార్టీ నాయకులు 

జడ్చర్ల: మండలం లింగంపేట్ గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్బంగా గ్రామ సర్పంచ్ రామనోళ్ళ బాలస్వామి మాట్లాడుతూ... తెలంగాణ  మాజీ సీఎం కేసీఆర్ ను సిట్ విచారణ  పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామాలు ఆడుతుందని, ఎన్ని విచారణలైనా ఎదుర్కోవడానికి కెసిఆర్ సిద్ధంగా ఉన్నారు. విచారణలో సిట్ అధికారులకే కేసీఆర్ చుక్కలు చూపెడతారని  లింగంపేట్  గ్రామ  బీఆర్ఎస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు  నిరంజన్, వార్డ్ మెంబర్ రవి,పార్టీ సీనియర్ నాయకులు వెంకట్ స్వామి గౌడ్, బిఆర్ఎస్ పార్టీ గ్రామ మాజీ అధ్యక్షుడు ఎండి తయ్యబ్, వెంకటయ్య, కృష్ణయ్య, యాదగిరి, మావిళ్ళ మహేష్, నరేందర్ రెడ్డి, వంశీ గౌడ్, రాజు, బాల్రాజ్, నరేష్, రాకేష్, ప్రవీణ్, జగన్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.