07-06-2025 12:00:00 AM
బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్
అదిలాబాద్, జూన్ 6 (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు బడిబాట కార్యక్రమాన్ని విజయవం తంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట 2025 కార్యక్రమాన్ని మన్నుర్లోని జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా తెలుగు ఉపాధ్యాయుడు చిందం ఆశన్న రూపొందించిన బడిబాట పాట సీడీని జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో కల్పిస్తున్నటువంటి సౌకర్యాలు మౌలి క సదుపాయాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠ శాలలకు దీటుగా నిలుస్తున్నాయని, పదవ తరగతిలో ఉన్నత ఫలితాలను సాధించుకున్నామని తెలిపారు.
ప్రభుత్వ పాఠశాల నమోదును పెంచే విధంగా ప్రతి ఒక్క పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయు లు కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి శ్రీనివాస్, మండ ల విద్యాధికారి ఉదయ్రావు, ఎంపిడిఓ, ఉపాధ్యాయులు, అంగన్వాడి సిబ్బంది, గ్రామ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.