calender_icon.png 25 June, 2025 | 2:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాగారం ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు కృషి

25-06-2025 01:21:17 AM

మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి

నాగారం, జూన్ 24 : నాగారం ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు తన వంతు కృషి చేస్తానని మాజీ మంత్రి,  సూర్యాపేట శాసనసభ్యులు గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి అన్నారు. మంగళవారం నాగారం గ్రామ ప్రభుత్వ పాఠశాలలో మరుగుదొడ్లు, పెయింటింగ్, ఫెన్సింగ్ లు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు.

దీంతో వెంటనే ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి స్పందించి మూడు రోజుల్లో నాగారం వచ్చి స్వయంగా  పాఠశాలను పరిశీలించి సొంత నిధులను కేటాయించి పూర్వ విద్యార్థిగా బాధ్యతను నెరవేర్చుతనన్నారు. ఆయనను కలిసిన వారిలో ప్రభుత్వ పాఠశాల పూర్వ విద్యార్థులు చిప్పలపల్లి నాగార్జున, కన్నెబోయిన శివకుమార్, కత్తుల వెంకన్న, చిప్పలపల్లి చిరంజీవి, వెంకన్న  తదితరులు ఉన్నారు.