02-06-2025 12:07:49 AM
టీఎస్ యూటీఎఫ్ అధ్యక్ష కార్యదర్శులు శాంతి కుమారి, హోసన్న
కుమ్రం భీం ఆసిఫాబాద్ జూన్ విజయ క్రాంతి: ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ కోసం టీఎస్ యుటిఎఫ్ ప్రచార జాతను నిర్వహిస్తుందని ఆ సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శాంతి కుమారి,ఉషన్న తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ప్రచార జాత కార్యక్రమంలో భాగంగా ఎంఈఓ రాథోడ్ సుభాష్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో ఎంతో నైపుణ్యం గల ఉపాధ్యాయులు విద్యనందిస్తారని, విశాలమైన తరగతి గదులు, ఆటస్థలం ఉంటాయని పోషకులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ఉచిత విద్యను పొందాలని విజ్ఞప్తి చేశారు.
సమగ్ర శిక్ష కమ్యూనిటీ కోఆర్డినేటర్ మధుకర్ మాట్లాడుతూ ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన ఉచిత ఆరోగ్య పరీక్షలు అందించడంతోపాటుమధ్యాహ్న భోజనం, పుస్తకాలు, స్కూల్ డ్రెస్ కచ్చితంగా అందించడం జరుగుతుందన్నారు.ప్రైవేట్ విద్య వ్యాపారులు తల్లిదండ్రులకు ఆశ చూపి సొమ్ము చేసుకుంటున్నారని చదువుల నాణ్యతలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల మధ్య ఎలాంటి వ్యత్యాసం లేదని పలు సర్వేలు వెల్లడించినట్లు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో నాయకులు దినకర్, టీకానంద్, మల్లేష్, సంజయ్ కుమార్, లక్ష్మణ్, సలీం, హిందూరావు, సుభాష్, దుర్గయ్య, హేమంత్ తదితరులు పాల్గొన్నారు.