calender_icon.png 30 June, 2025 | 7:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉపాధ్యాయ సంఘం బలోపేతానికి కృషి

30-06-2025 12:58:47 AM

టీడీపీ యువ నాయకుడు తాళ్ల వెంకటేష్ 

గుంటూరు, జూన్ 29 (విజయక్రాంతి): తెలుగు నాడు ఉపాధ్యాయ సంఘం బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని గుంటూరు జిల్లా టీడీపీ యువ నాయకుడు తాళ్ల వెంకటేష్ యాదవ్ పిలుపునిచ్చారు. ఆదివారం కొరిటిపాడులోని విజేత ఐఐటీ ఫౌండేషన్ విద్యాసంస్థ ఆవరణలో ఏర్పాటు చేసిన టీఎన్‌యూఎస్ రాష్ట్ర కార్యవర్గ కడప జిల్లా సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.

తెలుగు నాడు ఉపాధ్యాయ సంఘం విద్య అభివృద్ధికి కృషి చేయాలని  పిలుపునిచ్చారు. సమస్యల పోరాటాలకి తెలుగు నాడు సంఘం ముందుండి విజయం సాధించిందని గుర్తు చేశారు. ఉపాధ్యాయుల సమస్యలు తమ దృష్టికి తీసుకుని వస్తే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తానని తెలిపారు.

గత ప్రభుత్వంలో ఉపాధ్యాయులను వైన్స్ షాపుల దగ్గర పని చేయించిన దుస్థితి మనం చూశామన్నారు. విదేశాల్లో చదువుకుని, విద్య విలువ తెలిసిన మన విద్యాశాఖ మంత్రి ఉపాధ్యాయులకు వేస్తున్న పెద్దపీట ఎనలేనిదని తెలిపారు. తదుపరి ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.