25-06-2025 12:02:46 AM
వనపర్తి, జూన్ 24 ( విజయక్రాంతి ) : త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించెందుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుం ది. ఈ నెల చివరి నాటికీ స్థానిక సంస్థల నోటిఫికేషన్ వెలువడుతున్న ప్రచార నేపథ్యంలో పల్లె పోరు కు అధికార, ప్రతిపక్ష పార్టీలు సిద్ధం అవుతున్నాయి. దీనితో పల్లె ల్లో ఎన్నికల సందడి నెలకొంది.
ఆశావహు లు సైతం హడావిడి చేస్తున్నడంతో విలేజ్ పాలిటిక్స్ హీటెక్కాయి. జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల పదవులపై ఆశలు పెట్టుకున్న మండల, గ్రామ స్థా యి నాయకులు ఎన్నికలకు సన్నద్దమవుతున్నారు.
రిజర్వేషన్లపై ఉత్కంఠ..
స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ కో సం ఎదురు చూస్తున్న ఆశవహులకు పాత రిజర్వేషన్లు ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తా రా..? కొత్తగా రిజర్వేషన్లు మారుస్తారా..? అనే దానిపై ఆశావహుల్లో టెన్షన్ మొదలైంది. బీసీ కులగణన ప్రకారంగా రిజర్వేషన్లు కేటాయిం చాలని బీసీ నాయకులు కో రుతున్నప్పటికి పాత రిజర్వేషన్ల లేక కొత్త రిజర్వేషన్లలా ప్ర భుత్వంఎలాంటి నిర్ణయం తీసుకుంటోదన్న భయాలు సైతం వెంటాడుతు న్నాయి.
బీసీ కులగణన వివరాల ప్రకారమే రిజర్వేషన్లు ఖరారు చేస్తారని చర్చ సైతం జోరుగా కొనసాగుతోంది. ఈ క్రమంలో ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నాయకులు గ్రామాల్లో ఉన్న సా మాజిక వర్గాలను బట్టి రిజర్వేషన్లపై అంచ నా వేసుకుంటున్నారు.
కుదిరితే జంప్..
స్థానిక సంస్థల నోటిఫికేషన్ త్వరలో అన్న ప్రచారం జరుగతుండండంతో నాయకులు మల్లగుల్లా లు పడుతున్నారు. ఉన్న పార్టీలోనే కొనసాగాలా..? పక్క పార్టీ లోకి జంప్ చేయాలా..? అనే సందిగ్ధంలో ఉన్నారు. ఇకపోతే పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడంలో ఆ పార్టీలోని నాయకుల్లో స్థానిక సంస్థల ఎన్నికలపై జోష్ పెరిగింది. కొందరు పార్టీలతో ప నిలేకుండా ఓటర్లను పలకరిస్తూ తాను స్థాని క సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటిస్తున్నారు.
పరామర్శ, పలకరింపు లతో ప్రజల మధ్యలో.....
స్థానిక సంస్థ ల నోటిఫికేషన్ వెలువడుతు న్న నేపథ్యంలో పార్టీలకు సంభందం లేకుండా తమకు టికెట్ వచ్చిన రాకున్నా ఇండిపెండెంట్గా సైతం ఫోటి చేస్తామంటూ మీ మద్దతు ఓటు తమకే వేయాలంటూ ఒక్కసారి అవకాశం ఇవ్వాలంటూ ప్రజల వద్దకు పాలన అన్నట్లుగా ఇప్పటి నుండే ప్రజల మ ధ్యలోకి ఆశవహులు వస్తున్నారు. ఆయా గ్రా మాల్లో ఎవరైనా చనిపోతే ఆ కుటుంబ స భ్యులకు పరామర్శ తో పాటు దహన సం స్కారం ఖర్చు ల కోసం ఉన్నదానిలో కొంత అన్నట్లుగా ఆర్ధిక సహాయం ను అందచేస్తు, పెండ్లిలు పలు శుభ కార్యాలకు హాజరు అవుతున్నారు.
జిల్లాలో ఇలా ....
జిల్లాలో గత పాలక వర్గాల్లో సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అత్యధిక సంఖ్య లో గులాబీ పార్టీకి చెందిన వారే గెలుపొందారు. కొన్ని చోట్ల కాంగ్రెస్ నుంచి గెలుపొం దిన తర్వాత గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుతం రాజకీయ పరిణామాలు మారా యి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.
దీంతో గతంలో బీఆర్ఎస్ కు వెళ్లిన వారు సొంత గూటికి వచ్చేందుకు పావులు కదుపుతున్నారు. సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీ టీసీ స్థానాలపై ఆశలు పెంచుకొని పార్టీ పెద్ద ల మద్దతు కూడ గట్టుకునే ప్రయత్నం మొ దలు పెట్టారు. ఎన్నో ఏళ్లుగా పార్టీని నమ్ముకున్న వారు ఈసారి తమకు పదవీ యోగం ఉంటుందనే ఆశతో ఉన్నారు.