13 March, 2026 | 8:42 PM

గ్రామాలకు చేరుకున్న ఎన్నికల సిబ్బంది

16-12-2025 07:28 PM

కుబీర్ (విజయక్రాంతి): కుబీర్ మండలంలోని ఆయా గ్రామాల్లో బుధవారం నిర్వహించే గ్రామ పంచాయతీ ఎన్నికలకు సిబ్బంది గ్రామాలకు చేరుకున్నారు. మండలంలో మొత్తం 42 గ్రామ పంచాయతీలు ఉండగా ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఎన్నికల పోలింగ్ నిర్వహించి తర్వాత కౌంటింగ్ నిర్వహించి సర్పంచులను ఎన్నుకొనున్నారు. ఎన్నికల సామాగ్రిని ఆయా గ్రామాలకు ఎన్నికల సిబ్బంది తరలించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎన్నికల నియమావళి పాటించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలు ఓటు హక్కును సద్వినించుకోవాలని మండల అధికారులు పిలుపునిచ్చారు.