04-02-2026 12:00:00 AM
వేములపల్లి, ఫిబ్రవరి 3 : గ్రామాలలో ఉన్న విద్యుత్ సంబంధ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏ డి ఈ రవీందర్ రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని ముల్కపట్నం గ్రామంలో లూజ్ లైన్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి గ్రామంలో విద్యుత్ సమస్య లేకుండా పరిష్కరించాలని సూచించారు. అదనపు స్తంభాలను ఏర్పాటు చేయడంతో పాటు అవసరాన్ని బట్టి విద్యుత్ తీగలను బిగించాలని సిబ్బందికి సూచించారు. గ్రామంలోని ట్రాన్స్ఫార్మర్ల పనితీరును పరిశీలించారు. ఆయన వెంట ఏ ఈ నాగరాజు, సర్పంచి జెర్రీ పోతుల మౌనిక సురేందర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు భారీ పాండు, రాచూరి వెంకన్న, సోమనబోయిన సైదులు, లైన్మెన్ సతీష్ తదితరులున్నారు.