21 August, 2026 | 4:34 PM

Breaking News

శ్రీ సరస్వతి శిశుమందిర్‌లో ఘనంగా వరలక్ష్మీ వ్రతం   •   తంగళ్లపల్లి ఎస్‌హెచ్‌ఓ సిరిసిల్ల అశోక్ బాధ్యతల స్వీకరణ   •   పాఠశాల ప్రిన్సిపాల్ రూపా రెడ్డి ఘటనపై ఉట్నూర్ ఏఎస్పీ భరసా   •   సింగరేణి హెల్త్ కార్డుల్లో వ్యత్యాసాలు సరికాదు   •   హల్ద్వానీ ఘటనపై మంథనిలో కాంగ్రెస్ నిరసన   •   అమ్మవారి ఆశీస్సులతో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలి   •   శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తాం: మార్కెట్ చైర్మన్   •   రైతు బీమా, కళ్యాణలక్ష్మి పథకాలపై బీఆర్‌ఎస్ నిరసన ర్యాలీ   •   సరిహద్దులు సురక్షితంగా ఉంటేనే.. భారత్ సురక్షితం   •   విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని వినియోగదారుల వినతి   •  

అర్హులైన కుటుంబాలకు సంక్షేమ పథకాలు సకాలంలో అందుతాయి

21-08-2026 03:45 PM

కొండపాక, ఆగస్టు 21 (విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కొండపాక మండలంలోని కొండపాక, దుద్దెడ, వెలికట్ట తదితర గ్రామాల్లో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను గ్రామ సర్పంచ్‌లు, అధికారులు అందజేశారు. ఈ సందర్భంగా కొండపాక సర్పంచ్ మంచాల నవీన, దుద్దెడ సర్పంచ్ మిద్దె శివకుమార్, వెలికట్ట సర్పంచ్ బూర్గుల మానస సురేందర్‌రావు మాట్లాడుతూ స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా రేషన్ సరుకుల పంపిణీలో పారదర్శకత పెరిగి, అవినీతికి తావులేకుండా ఉంటుందన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు సకాలంలో అందేందుకు ఈ కార్డులు ఉపయోగపడతాయని తెలిపారు. కార్యక్రమంలో గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, అధికారులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.